ఏపి ఎలక్షన్స్ ఫలితాల ప్రభావం సినిమాల మీద కూడా భారీగానే పడినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏపిలో అద్భుతమైన ఫలితాలు అందుకున్న వైసిపి అధినేతకు టాలీవుడ్ అంతా శుభాకాంక్షల వెళ్లువ కురిపించింది. ఏపి ఎలక్షన్స్ ఫలితాల గురించి తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో కూడా హంగామా నడిచిందని తెలిసిందే. 


ఇదిలాఉంటే ఏపి కొత్త సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై టాలీవుడ్ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టింది. ఇప్పటికే టాలీవుడ్ అందరు స్టార్స్ జగన్ విజేత అని తెలిసిన వెంటనే సోషల్ మీడియా ద్వారా ఆయన్ను విష్ చేశారు. ఇక తెలుగు హీరోలే కాదు తమిళ హీరోలు కూడా జగన్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు. మే 31న రిలీజ్ కాబోతున్న ఎన్.జి.కే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం జరిగింది.


సూర్య హీరోగా సెల్వ రాఘవన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జగన్ పేరు మారు మోగిపోయింది. ఏపి సిఎం పేరు హైదరాబాద్ నడిబొడ్డున అది కూడా అరవ హీరో సినిమా ఈవెంట్ లో మార్మోగడం జగన్ సత్తా ఏంటో తెలుస్తుంది. పర్సనల్ గా జగన్ ఫ్యామిలీతో సత్సంబంధాలున్న సూర్య కూడా ఎన్.జి.కే ఈవెంట్ లో జగన్ ను జగనన్నా అని సంభోదించాడు.


తను తీసిన ఎన్.జి.కే సినిమా పాలిటిక్స్ కు సంబందించింది కాబట్టి రెండు రాష్ట్రాల సిఎంలు అంటూ కె.సి.ఆర్, జగన్ గురించి ప్రస్థావించాడు హీరో సూర్య. జగన్ ను జగనన్నా అనగానే ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయేలా కేకలు వినిపించాయి. అంతకుముందు ఇంటర్వ్యూ లో కూడా అనీల్ రెడ్డి తన క్లాస్ మెట్ అని.. అందుకే వైఎస్ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉందని అన్నారు సూర్య.     



మరింత సమాచారం తెలుసుకోండి: