‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ హీరోయిన్స్ ఎంపికలో రాజమౌళికి కొనసాగుతున్న కన్ఫ్యూజన్ ఇప్పటి వరకు అతడు ఏ సినిమా విషయంలోనూ ఎదుర్కుని ఉండడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీ షెడ్యూల్ రకరకాల కారణాలతో వాయిదా పడుతున్న పరిస్తుతులతో పాటు రాజమౌళికి ఈ సినిమా హీరోయిన్స్ విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం రాజమౌళి టీమ్ సాయి పల్లవితో కొనసాగిస్తున్న చర్చలు హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి బ్రిటీష్ నటి డైసీ జోన్స్ ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నప్పటి నుంచి రాజమౌళి కన్ఫ్యూజన్ మరింత పెరిగిపోయింది.  

బాలీవుడ్ హీరోయిన్స్ పరిణితి చోప్రా శ్రద్ధా కపూర్ లతో పాటు ఈమధ్యనే నిత్యామీనన్ వార్తలు కూడ బయటకు వచ్చాయి. అయితే వీటిపై క్లారిటీ లేకుండానే ప్రస్తుతం రాజమౌళి టీమ్ సాయి పల్లవితో చర్చలు జరుపుతున్న పరిస్థుతులలో ఆమె ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ లో నటీంచబోతోందా  అన్న సందేహాలు కలుగుతున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి టీమ్ సాయి పల్లవి ని బల్క్ డేట్స్ అడుగుతున్నట్లు టాక్. తాను నటించే సినిమాలోని పాత్ర నచ్చితే పారితోషిక విషయాలు కూడ పట్టించుకోని సాయి పల్లవి అన్నీ కుదిరితే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ లో ఎంటర్ కావడం ఖయాం అని అంటున్నారు. అయితే ఆమె చరణ్ పక్కన నటిస్తుందా లేకుంటే జూనియర్ పక్కన నటిస్తుందా లేదంటే ఆమెది ప్రత్యేక పాత్రగా మారనున్నదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: