ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎట్టకేలకు తాను దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలైంది. ఇదే క్రమంలో తన సినిమాని అడ్డుకున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని దించేసిన జగన్ ప్రభుత్వం ఏర్పడటంతో జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎంతో సంతోషంగా హాజరయ్యారు రామ్ గోపాల్ వర్మ.


కాగా నిన్న జగన్ ప్రమాణస్వీకారం నేడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కావడంతో రాంగోపాల్ వర్మ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. మొదటి నుండి తన వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే వర్మ త్వరలోనే కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన కామెంట్స్ చేశాడు. కులాల ఆధారంగా పెట్టుకున్న టైటిల్ ని ఓపెన్ గానే చెప్పేశాడు.


దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు టైటిల్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తే మిగతా సామాజికవర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో మరోసారి కులాలను ఉద్దేశిస్తూ మరో పోస్ట్ పెట్టారు.'ఎండలకి భయపడి కాదు.. రెడ్లకు భయపడి కమ్మోళ్ళు బయటకి రావట్లేదంట' అని ట్వీట్ చేశాడు. దీంతో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండే సామాజిక వర్గానికి చెందిన వారు రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్లు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: