తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ...ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి సీక్వెల్ ని తీయడం అంటే అంత ఈజీ కాదు. ఈ సీక్వెల్ కి పక్కాగా కథ కుదరాలి. దాన్ని తెరపైకి తీసికు వచ్చే సత్తా ఉండాలి. అప్పుడే సీక్వెల్ హిట్టవుతాయి. లేదంటే ఫట్టే. 2014  బ్లాక్ బస్టర్ కార్తికేయ కి సీక్వెల్ తీయాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నారు. అది ఇన్నాళ్ళకు కుదిరింది. కార్తికేయ సీక్వెల్ ని అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. నిఖిల్  హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తికేయ - 2 త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయాన్ని  దర్శకనిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.


జూన్ 1న నిఖిల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఒక రోజు అడ్వాన్స్ డ్ గానే దర్శకనిర్మాతలు నిఖిల్ కి కానుకను 'కార్తికేయ -2' ప్రకటించారు. ఈ సినిమాని టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చందు మొండేటి మాట్లాడుతూ నిఖిల్ హీరోగా దర్శకునిగా నా తొలి చిత్రం కార్తికేయ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో కార్తికేయ - 2 పైన భారీ అంచనాలుంటాయనే భావిస్తున్నాం. అందుకు తగినట్టుగానే ఈ చిత్రం ఉంటుంది. కార్తికేయ కు కొనసాగింపుగా కథాంశం ఉంటుందని చెప్పాడు.


అయితే చందు మొండేటి చేతిలో ఇప్పటికే రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఓవైపు శర్వానంద్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈలోగానే నిఖిల్ హీరోగా చందు దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్ ని మేకర్స్ ప్రకటించారు. అయితే ముందుగా ఈ రెండిటిలో ఏ సినిమా ప్రారంభం కానుంది అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఇక సీక్వెల్ నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇతర నటీనట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే అధికారకంగా ప్రకటిస్తారట.


మరింత సమాచారం తెలుసుకోండి: