ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో  తెలుగుదేశం ఘోర పరాజయం చెందడంతో చంద్రబాబు నాయకత్వం పై సందేహాలు మొదలైన పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని రక్షించగలడు అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్ పెను ప్రకంపనలుసృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలి అంటే తారక్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర తీసుకోవాలా వద్ద అనే విషయం పై వర్మ ఒక ఒపీనియన్ పోల్ నిర్వహించాడు.

ఈ పోల్ కి నెటిజన్ల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ పోల్ లో పాల్గొన్న 79 శాతం మంది టీడీపీ పగ్గాలు తారక్ చేతిలో ఉండాలని అభిప్రాయపడగా కేవలం 21 శాతం మంది మాత్రమే చంద్రబాబు వైపు మొగ్గు చూపడం కొసమెరుపు. ఈ ఆన్ లైన్ పోల్ కు 41 911 ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఈవార్తల పై వర్మ స్పందిస్తూ  ‘ఓ హో 79 శాతమా? అబ్బా’ మొత్తానికి టీడీపీ పార్టీ వాళ్ళు కూడా తారక్ లీడర్‌ షిప్‌ ని కోరుకుంటున్నారన్న మాట’ అంటూ కామెంట్స్ చేసాడు.  

ఇప్పుడు ఈ ఆన్ లైన్ పోల్ ఫలితాలు బాలయ్య అభిమానులలో గుబులు పుట్టిస్తున్నాయి. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టగల శక్తి బాలయ్యకు ఉంది అని కలలు కంటున్న నేపధ్యంలో ఈ ఆన్ లైన్ పోల్ ఫలితాలు బాలయ్య అభిమానులకు మింగుడు పడటం లేదు అని టాక్. 

దీనికితోడు వర్మ నిర్వహించిన ఈ ఆన్ లైన్ పోల్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో కూడ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సినిమాలు తప్ప మరొక విషయం పట్టించుకోకుండా రోజులు గడుపుతున్న జూనియర్ వర్మ లాంటి వ్యక్తులు వేసే ట్రాప్ లో పడి భంగపడే వ్యక్తిత్వం జూనియర్ ది కాదనీ తన బలాలు బలహీనతలు జూనియర్ కు బాగా తెలుసు అంటూ మరికొందరు ఇండస్ట్రీ వర్గాల వ్యక్తులు అభిప్రాయ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: