మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 నుంచి కంటిన్యూస్ గా సినిమాలు చేయడానికి అంగీకరిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా అందరి సమస్యలను పరిష్కరిస్తూనే వరుసగా సినిమాలు చేసుకుంటు వెళుతున్నారు. చారిత్రాత్మక చిత్రం సైరా కంప్లీట్ చేస్తూనే కొరటాల శివ తో సెట్స్ పైకి వెళ్ళడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఒక బలమైన కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. అంతేకాదు మెగాస్టార్ బర్త్‌డే అయిన ఆగస్ట్ 22న ఈ సినిమాను లాంచ్ చేసి మెగా ఫ్యాన్స్ కి మెగా గిఫ్ట్ ఇవ్వబోతున్నారని లేటెస్ట్ అప్‌డేట్.


సెప్టెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్‌ చేయనున్నాడన్న లేటెస్ట్ హాట్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు. ఒకవేళ ఇదే కథా వస్తువు గనకైతే రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్ సినిమా పోలికలు ఉండే అవకాశం లేక పోలేదు. ఎందుకంటే గతంలో కొరటాల శివ మహేష్ తోనే తీసిన శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలలో కూడా రైతుల సమస్యల మీద సన్నివేశాలు రూపొందించారు.


ఇక మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ కూడా రైతు సమస్యల మీద అల్లిన కథే. మరి మళ్ళీ అలాంటి కథనే తీస్తే ఎలా అనే అనుమానాలు ఇప్పటికే ప్రేక్షకుల మనసులో మెదులుతోంది. అంతేకాదు తీసిన కథే మళ్ళీ తీస్తే మెగా ఫ్యాన్స్ హర్టవడం ఖాయం. మరి ఇందులో ఎంత వాస్తవముందో తెలియాలంటే రచయిత దర్శకులు కొరటాల శివ మాత్రమే సమాధానం చెప్పాలి. ఇక మెగా స్టార్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొనే శివ ఈ కథను సిద్దం చేశాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సినిమాలో చిరు పక్కన నటించే హీరోయిన్..తదితర విషయాలను త్వరలో వెల్లడించబోతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: