ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి..ఇలా వరుసబెట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని మాస్ మహా రాజా గా మాస్ ఇమేజ్ ని క్రియోట్ చేసుకున్న రవితేజ....ఈ మధ్య 'రాజా ది గ్రేట్' వంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ వరుసగా మూడు ఫ్లాప్ లను చూశాడు. అందుకనే ఈమధ్య తన కెరీర్లో నెమ్మదించాడు. కానీ గతంలో మాస్ రాజా స్పీడు మామూలుగా ఉండేది కాదు. ప్రతి నాలుగైదు నెలలకు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు. విమర్శకులు మసాలా ఫార్మాట్ అని పెదవి విరుస్తూనే ఉంటారు.. ఆయన సినిమాలు హిట్ అవుతూనే ఉంటాయి. అందుకనే మళ్ళీ వరుస హిట్స్ కోసం పాకులాడుతున్నాడు.


రవితేజ ప్రస్తుతం 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా తర్వాత నటించబోయే మరో సినిమాను కూడా రవి తేజ ఫైనలైజ్ చేశాడని సమాచారం. ఈ సినిమాతో పాటు ఆర్.ఎక్స్.100 ఫేం అజయ్ భూపతి తో కూడా ఓ సినిమాని కమిటయ్యాడని ఫిల్మ్ నగర్ సమాచారం. వీటితో పాటు గతంలో తనకి  'డాన్ శీను', 'బలుపు' రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ న్యూస్. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈమధ్య ఒక ఇంట్రెస్టింగ్ కథతో మాస్ రాజాను మెప్పించాడట. ఈ కథ నిజ జీవిత సంఘటనల ఆధారంగా అల్లుకున్నరియలిస్టిక్ స్టొరీ అని టాక్. 


అందుకే ఇప్పుడు రవితేజ - గోపిచంద్ మలినేని హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారట. గోపీచంద్ మలినేని లాస్ట్ సినిమా 'విన్నర్' బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ ఫలితాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఫైనల్ గా మాస్ రాజానే గోపీచంద్ కి అవకాశం ఇచ్చాడు.  'డిస్కోరాజా' సినిమా షూట్ పూర్తయ్యే లోపే ఈ సినిమాను లాంచ్ చేస్తారని అంటున్నారు.  ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఫైనలైజ్ చేసుకున్నారట.  త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు  అధికారకంగా వెల్లడవనున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: