సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టే స్టామినా ఉన్న హీరోలే. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా మహేష్ తండ్రికి తగిన తనయుడిగా మళ్లీ సూపర్ స్టార్ స్క్రీన్ నేం తెచ్చుకున్నాడు. ఇక ఎన్.టి.ఆర్ కూడా నందమూరి వారసుడిగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు.


సినిమాల పరంగా ఆరోగ్యకరమైన పోటీ ఉన్న ఈ ఇద్దరి హీరోల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మహేష్ భరత్ అనే నేను ఆడియోకి ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చి అన్నయ్యా అని పిలవడం అందరిని సర్ ప్రైజ్ చేసింది. అయితే ఒకే వేదికపై ఒకసారి కనిపిస్తేనే అలా ఉంటే ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అబ్బో అదిరిపోతుంది కదా.


మహేష్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ చేస్తే ఆ సినిమా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అయితే ఇప్పటికే రాజమౌళి డైరక్షన్ లో తారక్, చరణ్ కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు రియల్ లైఫ్ హీరోల పాత్రలను పోశిస్తున్నారు. ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్, మహేష్ మల్టీస్టారర్ చేస్తే అది త్రివిక్రం డైరక్షన్ లోనే ఉండాలని ఆశిస్తున్నారు.


ఇద్దరికి మంచి స్నేహితుడైన త్రివిక్రం ఇద్దరిని బ్యాలన్స్ చేస్తూ కథ రాస్తాడు. అంతేకాదు హీరోల కెపాసిటీ తెలుసు కాబట్టి దానికి తగినట్టుగానే కథ సిద్ధం చేస్తాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న త్రివిక్రం ఆ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేస్తాడని టాక్. మరి మహేష్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ సినిమా కలగానే మిగులుతుందేమో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: