తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేసిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి డైరక్షన్ లో ప్రభాస్, రానా కలిసి నటించిన ఈ సినిమా 2000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. ఇండియన్ సినిమా బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పుకునేలా చేశారు. బాహుబలి స్పూర్తితో ఎన్నో చారిత్రిక కథలకు ప్రాణం పోశాయి.


ఇదిలాఉంటే ఇక మీదట బాహుబలి గురించి కాదు సైరా నరసింహా రెడ్డి గురించి మాట్లాడుకుంటారట. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న సైరా సినిమాను మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. 


250 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా బాహుబలిని మర్చిపోయేలా చేస్తుందని అంటున్నారు. సినిమా దాదాపు ముగింపు దశకు చేరుకోగా రష్ చూసిన చిరు సినిమా మరో అద్భుత కళాకండం అవుతుందని చెప్పారట. కచ్చితంగా బాహుబలి రేంజ్ కు రీచ్ అయ్యే కంటెంట్ ఉందని. సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయాలని చూస్తున్నారట.


ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. సైరా నరసింహా రెడ్డితో కూడా అలాంటి సంచలనాలే సృష్టితాడని ఆశిస్తున్నారు మెగా ఫ్యాన్స్. సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ వంటి క్రేజీ స్టార్స్ కూడా భాగం అవుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: