సాధారణంగా స్టార్ హీరో..హీరోయిన్లుకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు..అందులోనూ వారి కోసం పిచ్చెక్కి పోయి ఏం చేయడానికైనా సిద్దపడే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అలాంటి ఫ్యాన్స్ వల్ల కొంత మంది స్టార్ హీరోలకు ఇబ్బందులే కాదు విపరీతమైన పాపులారిటీ కూడా వచ్చిపడుతుంది. తాజాగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి వచ్చింది. ఆయన అభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాసిక్ లోని ఓ ధియోటర్ లో ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే..ఆశిష్ సింఘాల్ అనే వ్యక్తి సల్మాన్ ఖాన్ కి చిన్నప్పటి నుంచి వీరాభిమానిగా ఉంటూ వస్తున్నారు. సల్మాన్ నటించే ఏ చిత్రమైనా రిలీజ్ కి ముందు నుంచే నానా హడావుడి చేస్తూ వస్తుంటారు. ఈ నేపథ్యంలో రంజాన్ కి రిలీజ్ కాబోతున్న ‘భారత్’చిత్రం కోసం మార్నింగ్ షోకు థియోటర్ మొత్తం బుక్ చేసేసాడు. అసలు ఆ రోజు అన్ని షోలు టిక్కెట్లు బుక్ చేసేద్దామనుకున్నా అతని ఆర్దిక స్దోమత సహకరించక ఆగిపోయాడట. మొత్తానికి ఈ వీరాభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వెరైటీగా మారిపోయింది.
అలీ అబ్బాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పట్ల ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. సినిమాలో జాకీష్రాఫ్ కూడా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన సల్మాన్ తండ్రిగా కనింపిచనున్నారని సమాచారం. 2014లో వచ్చిన కొరియన్ హిట్ మూవీ ‘యాన్ ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ హిందీ రీమేక్. ఈ ఏడాది ఈద్ స్పెషల్గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.