టాలీవుడ్ లో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కొదమ సింహం’ అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. తెలుగు లో కౌబాయ్ సినిమాలు ఎన్నో వచ్చినప్పటికీ చిరంజీవి నటించిన ఈ సినిమాకు అప్పట్లో ఓ ట్రెండ్ సృష్టించింది.  ఇందులో మెగాస్టార్ నటన, ఫైట్స్, డ్యాన్స్, పాటలు ఒక్కటేమిటి..మోహన్ బాబు నవ్వులు..అన్ని సమ్మిళతమై సూపర్ హిట్ అయ్యింది.  అయితే ఆ స్థాయిలో ఇప్పటి వరకు ఏసినిమా రాలేదనే చెప్పొచ్చు.  


ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ తనయుడు రాంచరణ్ హీరోగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఇప్పటి వరకు రాంచరణ్ నటించిన సినిమాలు ఒకటీ రెండు తప్ప అన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  ప్రస్తుతం  రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’రూపొందుతుంది. 


ఆ మద్య పూనేలో ఈ సినిమా షూటింగ్ సమయంలో రాంచరణ్ జిమ్ చేస్తుండగా కాలికి గాయం అయ్యింది..దాంతో నెలరోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.  ప్రస్తుతం కాస్త కోలుకున్న రాంచరణ్ తన భార్య ఉపాసనతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే..ఇందుకు సంబంధించిన ఫోటోలు ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. 

తాజాగా ఇప్పుడు మరో సెన్సేషన్ కి తెరలేపింది ఉపాసన. తాము విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోల్లో ఒక ఫోటోకి 'కొదమసింహం' అన్న ట్యాగ్ లైన్ తగిలించింది. అంటే భవిష్యత్ లో రాంచరణ్ ‘కొదమసింహం’గా కనిపించబోతున్నారా అన్న సందేహాలు ఫ్యాన్స్ కి మొదలయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: