యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి రెండు భాగాల తరువాత రాజమౌళి చిత్రీకరిస్తుండడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు ముందు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, చరణ్ లు కూడా వరుస విజయాలతో మంచి ఫామ్ లోనే కొనసాగుతున్నారు అనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత మరొక భారీ ప్రాజక్ట్ ని కూడా దక్కించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. 

అది మరేదో కాదు, కెజిఎఫ్ చాప్టర్ వన్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక చిత్రం చేయబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్ 2 ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయిన ప్రశాంత్ నీల్, ఆ సినిమా తరువాత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తోనే ఒక సినిమా చేయబోతున్నట్లు చెపుతున్నారు. నిన్న ప్రశాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని టాలీవడ్ భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానితో అయన తన తదుపరి సినిమా మైత్రి వారితో చేయబోతున్నట్లు కొంత అర్ధం అయింది. ఒకవేళ ప్రశాంత్, మైత్రి వారితో సినిమా చేయదలిస్తే హీరోగా ఎవరిని ఎంచుకుంటారు, కథ మరియు కథనాలు ఎలా ఉంటాయి అనే దానిపై నిన్నటినుండి మీడియా వర్గాల్లోనూ, అలానే టాలీవుడ్ సినిమా వర్గాల్లోనూ విపరీతంగా వార్తలు వెలువడుతున్నాయి. 

అయితే ప్రశాంత్ చేయబోయే సినిమా ఎన్టీఆర్ తోనే ఉండబోతోందని, ఈ మేరకు మైత్రి బ్యానర్ తో రెండు రోజుల క్రితం ఒక ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం. నిజానికి ప్రశాంత్, ఇటీవల ఎన్టీఆర్ కు ఒక స్టోరీ లైన్ చెప్పారని, అది నచ్చడంతో అయన వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. ఇక ప్రస్తుతం సినీవర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్త కనుక ఒకవేళ నిజమే అయితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా లభించినట్లే మరి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: