ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చాలా వచ్చేవి. రజినీకాంత్, కృష్ణ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే రజినీకాంత్, మెగాస్టార్ కాంబినేషన్లో కూడా సినిమాలు వచ్చాయి. అవి అప్పటి రోజులు. ఇప్పుడు అలా కాదు. ఒక హీరోతో సినిమా చేయాలంటే.. వందల కోట్లు పెట్టాల్సిన పరిస్థితి. అలాంటిది.. ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయాలి అంటే మినిమమ్ ఆర్ఆర్ ఆర్ సినిమాకు పెట్టిన బడ్జెట్ అవుతుంది.
ఇంత బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఒకవేళ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వచ్చినా మన హీరోలు చేస్తారా..? చేస్తామని ముందుకు వస్తే... కథ ఎక్కడి నుంచి వస్తుంది. అలాంటి కథ దోరకం కష్టమే కదా. సింగిల్ హీరోతో సినిమాలు చేస్తూ హిట్ కొట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది మల్టిస్టారర్ సినిమా అంటే మరీ కష్టం అవుతుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సందర్భంలో ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తే ఫ్యాన్స్ కు బాగుంటుంది కదా. అలాగే పెట్టిన బడ్జెట్ కు న్యాయం చేసినట్టు ఉంటుంది. నిర్మాతలు సేఫ్ అవుతారు.
మహేష్ బాబు, అల్లు అర్జున్ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తే బాగుంటుందని కొందరు నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇద్దరితో కలిసి సినిమాలు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే చూడాలని ఉందని కొందరి అభిప్రాయం. మహేష్ 27 వ సినిమా పూర్తయ్యాక.. బన్నీతో కలిసి సినిమా చేస్తే బాగుంటుందని అంటున్నారు. మరి అందుకు ఈ హీరోలు ఏమంటారో.