నాపేరు సూర్య తరువాత బన్నీ... త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  దీని తరువాత బన్నీ సుకుమార్ తో సినిమా చేయాలి. సుకుమార్ ఇప్పటికే కథను సిద్ధం చేశాడు.  అప్పట్లో మహేష్ బాబుకు చెప్పిన కథతోనే సినిమా చేస్తున్నాడు.  


అయితే మార్పులు చేసి పక్కా స్క్రిప్ట్ తో ముందుకు వెళ్తున్నాడట.  ఇదిలా ఉంటె, ఈ సినిమా కోసం సుకుమార్ ఓ ప్రయోగం చేస్తున్నట్టు సమాచారం.  దాదాపు సంవత్సరం పాటు కూర్చొని తయారు చేసుకున్న స్క్రిప్ట్ కాబట్టి ఈ స్క్రిప్ట్ ప్రకారం సినిమా చేయాలి కాబట్టి, సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటున్నాడట.  


ఎర్రచందనం మీద ఆయన అపారమైన పరిశోధన జరిపారు. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికర అంశాలు తెలిశాయట. పదుల సంఖ్యలో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లు స్క్రిప్టులోకి వచ్చి చేరాయట. వాటన్నింటినీ ఒక్క సినిమాలో చూపించడం కష్టమని.. కథ విస్తృతి కూడా పెరిగిందని.. ఈ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమా తీయాలని అనుకుంటున్నారని సమాచారం. 


అయితే, ఒకానొక దశలో సినిమాగా తీస్తే చాలా వస్తుంది కాబట్టి తన దగ్గర ఉన్న అసిస్టెంట్లతో వెబ్ సీరీస్ గా దీన్ని తీయించాలని అనుకున్నారు.  కానీ ఎందుకో మరి ఆ ఆలోచనను విరమించుకొని సినిమాగా తీయాలని అనుకున్నాడు.  మరి బాహుబలి తరహా ప్రయోగం హిట్ అవుతుందా లేదంటే.. ఎన్టీఆర్ బయోపిక్ లా మారుతుందా.  ? 


మరింత సమాచారం తెలుసుకోండి: