తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఓవర్’. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200కు పైగా స్క్రీన్లలో తెలుగు, తమిళం, హిందీ భాషలలో జూన్ 14న విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, కొద్దిరోజుల క్రితం వచ్చిన థియేట్రికల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. అంతేకాకుండా ఇవి సినిమాపై ఆసక్తిని పెంచాయి. 


ప్రముఖ బాలీవుడ్ రచయిత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి హిందీలో సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇంత వరకూ భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడు రాని సరికొత్త కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని నిర్మాతలు చెబుతున్నారు. వెన్నులో వణుకు పుట్టించే కథ, కథనాలు ఈ థ్రిల్లర్ మూవీ సొంతం అంటున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా త్వరలో తాప్సి తెలుగు మీడియాను కలువనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

తమ సంస్థ గతంలో నిర్మించిన ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’ చిత్రాల విజయాల సరసన ఈ ‘గేమ్ ఓవర్’ నిలుస్తుందని నిర్మాత ఎస్.శశికాంత్ అన్నారు. 
ఈ చిత్రానికి రోన్ ఏతాన్ యోహాన్ సంగీతం సమకూర్చారు. అశ్విన్ శరవణన్, కావ్య రాంకుమార్ కథ, కథనం అందించారు. వెంకట్ కాచర్ల తెలుగు మాటలు రాశారు. ఎ.వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. ‘రియల్’ సతీష్ స్టంట్స్ కంపోజ్ చేశారు. 
 
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: