మెగా కాంపౌండ్ నుండి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయినా సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు సరైన హిట్టు కోట్టలేకపోయాడు. చేసిన సినిమాలు ప్రతి ఒక్కటి బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో సాయి ధరంతేజ్ పై మెగా అభిమానులు పెట్టుకుంటున్న ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి.


గతంలో చిరంజీవి పాత సినిమాలలో ఉన్న పాటలను రీమేక్ చేస్తూ మెగా అభిమానులను ఆకర్షించిన..చేసిన సినిమాలో దమ్ము లేకపోవడంతో చాలా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు సాయి ధరమ్ తేజ్. చివరిగా విజయవాడ సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి సినిమా పెద్దగా  కూడా ఏమీ అలరించలేకపోయింది. ముఖ్యంగా సాయిధరమ్తేజ్ తాను నిర్మించుకున్న సినిమాల విషయంలో గతంలో డైరెక్టర్గా ట్రాక్ రికార్డు చూసే సినిమాలను ఒప్పుకోవడం జరిగింది.


అయితే ఆ సినిమాలు ఏవీ కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇటువంటి క్రమంలో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సాయి ధరంతేజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చేయని పాత్రలో సాయి ధరంతేజ్ నటిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. మరోపక్క ఈ సినిమాతో అయినా సాయి ధరంతేజ్ ఇష్టపడతారని కళ్ళు కాయలు కాసే టట్లు ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో మెగా అభిమానులు ఇదే సాయి ధరమ్ తేజ్ కి చివరి అవకాశమని కామెంట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: