మహెష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా జూన్ 26 నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్నది. రష్మిక మొదటిసారి మహేష్ తో కలిసి నటిస్తోంది.  ఇక 13 సంవత్సరాల క్రితం సినిమాలకు దూరమైనా రాములమ్మా.. తిరిగి మహేష్ సినిమాతో సెకండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది.  ఇందులో ఆమెది ఓ పవర్ఫుల్ రోల్.  


ఇందులో చాలా కొత్త హంగులు కనిపించబోతున్నాయి.  మహేష్ మొదటిసారి ఆర్మీ మేజర్ గా చేస్తున్నాడు.  అలానే సినిమా ఎక్కువగా భాగం పల్లెటూరితో సంబంధం ఉన్న సినిమా.  పల్లెటూరిలో సంబంధం ఉన్న సినిమాలు మహేష్ వరసగా చేస్తున్నాడు.  శ్రీమంతుడు, మహర్షి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ... ఇవి పల్లెటూరి సినిమాలే కావడం విశేషం.  


అంతేకాదు, మహేష్ బాబు మొదటిసారిగా పక్కా ఎంటర్టైనర్ గా సినిమాలో నటిస్తున్నాడు.  యాక్షన్ సినిమాలైతే బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. కానీ, ఎంటర్టైనర్ సినిమా కాబట్టి బడ్జెట్ తక్కువే.  అయినప్పటికీ ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు ఉన్నారు అంటే.. అర్ధం ఏంటో తెలియడం లేదు.  ఒకవేళ సినిమాను హై బడ్జెట్ తో తీయబోతున్నారా.. 


బడ్జెట్ ఎంత అవుతుంది.. సినిమాను ఎలా తీయబోతున్నారు.  లోకేషన్స్ ఏంటి అనే విషయాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి.  ఏది ఏమైనా మహేష్ రూటు మార్చి ఎంటర్టైనర్ సినిమా చేయడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: