దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అంచనాలు తారాస్థాయికి చేరాయి. అంతేకాక ఇటీవల ఈ సినిమాకు సంబందించిన ఏదో ఒక న్యూస్ బయటకొచ్చి ఆ అంచనాలను మరింత పెంచేస్తోంది. ఇక ఇటీవల జరిగిన షూటింగులో గాయపడ్డ ఇద్దరు హీరోలు కోలుకోవడంతో ప్రస్తుతం షూటింగ్ మళ్ళి మొదలయింది. 

అయితే ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న రాజమౌళి, త్వరలో ఒక భారీ ఫైట్ ని తీయబోతున్నట్లు సమాచారం. అయితే ఆ ఒక్క ఫైట్ కోసం ఏకంగా రెండు నెలల లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసారట. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొననున్న ఈ ఫైట్ లో దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు, అలానే కొన్ని గుర్రాలు, ఏనుగులు పాల్గొనగా ఎంతో భారీలెవెల్లో దీన్ని చిత్రీకరించనున్నారని సమాచారం. అయితే ఈ ఒక్క ఫైట్ సన్నివేశం కోసమే రాజమౌళి దాదాపు 45 కోట్ల బడ్జెట్ కేటాయించారట. అలానే ఓ గ్రాండ్ విజువల్ వండర్ గా ఈ ఫైట్ సన్నివేశాన్ని మలచనున్నారట. 

అంతేకాదు ఈ ఫైట్ సినిమాలో ఎంతో అద్భుతంగా ఉండడంతో పాటు, ప్రేక్షకుడికి ఒక ఐఫీస్ట్ లా ఉండడం ఖాయమని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇక దాదాపు 350 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేస్తున్నట్లు రాజమౌళి గతంలోనే ప్రకటించారు. మరి ఈ విధంగా ఇన్నిరకాల ప్రత్యేకతలున్న ఈ సినిమా రేపు విడుదల తరువాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: