టాలీవుడ్ లో ఈ మద్య ఇతర భాష హీరోయిన్ వరుసగా వస్తున్నారు.  అందులో కొద్ది మంది మాత్రమే సక్సెస్ పొందుతున్నారు.  వాస్తవానికి తెలుగు లో మాలీవుడ్ హీరోయిన్లు కొంత కాలంగా మంచి ఛాన్సులు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్లు గా ఎదిగిపోతున్నారు.  నయనతార తర్వాత సాయిపల్లవి, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు తెలుగు,తమిళ భాషల్లో రాణిస్తున్నారు. తెలుగు లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే సినిమాలపై ఎన్నో అంచనాలు ఉంటాయి.  ఆయన తన సినిమాల్లో వినోదంతో పాటు..సందేశం, ఎమోషన్స్ అన్ని సమ్మిళితం చేస్తుంటారు.  


మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ బ్యాగ్ గ్రౌండ్ ఏమాత్రం ఉపయోగించుకోకుండా అల్లు అర్జున్ తన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.  త్రివిక్రమ్-బన్ని కాంబినేషన్ లో వచ్చిన జులాయి సూపర్ హిట్అయ్యింది.  ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’మరో బ్లాక్ వస్టర్ అందుకుంది.  ఈ సినిమాలో ఫాదర్ సెంట్ మెంట్ బాగా పండింది.  


తాజాగా ఇప్పుడు మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరోసినిమా రాబోతుంది.  ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయి..రెండో షెడ్యూల్ నిన్ననే ప్రారంభం అయ్యింది.  ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా మొదటి హీరోయిన్ పూజా హెగ్డే కన్ఫామ్ అయ్యింది.  నిన్నటి వరకు రెండో హీరోయిన్ ఎవరు అన్న విషయంపై క్లారిటీ లేదు.  తాజాగా ఇప్పుడు రెండో హీరోయిన్ పై అప్ డేట్ వచ్చింది.  ఆమె ఎవరో కాదు ఆ మద్య సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి హీరోయిన్  నివేదా పేతురాజ్.  చాలా ట్రెడిషనల్ గా ఉండే ఈ హీరోయిన్ మరి బన్ని సరసన చిందులేస్తుందా..సాంప్రదాయంగా ఉంటుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: