గత ఆరు సంవత్సరాల నుండి జబర్ధస్త్ లో జడ్జీగా నటి, నగరి ఎమ్మెల్యే రోజా జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  అయితే గతంలో రోజా నగరి నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు..దాంతో ఆమె జబర్ధస్త్ లో కొనసాగుతుందో లేదో అన్న అనుమానాలు వచ్చాయి.  కానీ జబర్ధస్త్ ఆమెకు మంచి పేరు రావడంతో అలాగే కంటిన్యూ అవుతు వచ్చారు.  ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఆమె నగరి నుంచి పోటీ చేసి గెలిచారు.

ఈ నేపథ్యంలో పార్టీ ప్రచారం కోసం రెండు మూడు నెలలు జబర్ధస్త్ కి దూరంగా ఉంటూ వచ్చింది రోజా.  మరోవైపు జనసేన తరుపు నుంచి పోటీ చేసిన నాగబాబు కూడా జబర్ధస్త్ దూరమయ్యారు.  అయితే వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజాకు మంత్రి పదవి ఖాయం అంటూ ఊహాగానాలు వినిపించాయి. మరికొందరైతే రోజాకు జగన్ హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నారని కూడా అంచనా వేశారు.  ఇక ఆమె జబర్దస్త్ షోకు దూరం కాక తప్పదని ఊహాగానాలు వినిపించాయి.

కానీ ఇప్పుడు అంతా సీన్ రివర్స్..అందరూ అనుకుంటున్నట్లు రోజాకు ఏ మంత్రి పదవీ దక్కలేదు. దాంతో మళ్లీ ఆమె ప్రశాంతంగా జబర్ధస్త్ కంటిన్యూ చేసుకోవచ్చు అంటున్నారు అభిమానులు. ఇక త్వరలో నాగ బాబు కూడా బజర్ధస్త్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం అందుంతుంది. మొత్తానికి మరి కొంత కాలం పాటు వీరిద్దరూ జబర్దస్త్ లో న్యాయ నిర్ణేతగా కొనసాగే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: