మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా చిత్రాన్నిచేస్తున్న సంగతి తెలిసిందే.  అల్లు అర్జున్ కెరీర్ లో ఇది 19 సినిమా కావడంతో #AA19 అన్న వర్కింగ్ టైటిల్‌గా పిలిచుకుంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి రెండు అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్ తో ఈ సినిమాపై ఇంకా ఆసక్తి రెట్టింపు అయింది. ఇక బన్నీ ఫ్యాన్స్ ఆనందానికైతే అవధులు లేకుండా పోయాయి.


త్రివిక్రమ్ సినిమా అంటేనే చాలామంది ఫెమీలియర్ యాక్టర్స్ నటిస్తుంటారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, స్నేహ, నుంచి తెలుగమ్మాయి అయిన ఈషా రెబ్బా, నవీన్ చంద్ర వరకు లిస్ట్ బాగానే ఉంది. ఒక్కోసారి ఐదు పది నిముషాల పాత్రకు కూడా సీనియర్ యాక్టర్స్ ని తీసుకుంటారు. అలానే ఇప్పుడు బన్నీ-త్రివిక్రమ్ సినిమాకోసం కూడా అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు.


ఈ సినిమాలో టాలీవుడ్ హీరో.. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ ను ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నారు.  అలాగే హీరోయిన్ నివేద పెతురాజ్ ను కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం తీసుకున్నారు.  సుశాంత్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా #AA19 టీమ్ అధికారికంగా ధృవీకరించారు.  ఇక హీరోయిన్ నివేద పేతురాజ్ ఎంట్రీ ఒక సర్ ప్రైజ్. తమిళంలో చాలా సినిమాలు చేసిన నివేద ఈమధ్య తెలుగులో సాయి తేజ్ 'చిత్రలహరి' లో కూడా నటించింది. ఈ ఇద్దరినీ టీమ్ లోకి ఆహ్వానిస్తూ నిర్మాతలైన హారిక హాసిని.. గీతా ఆర్ట్స్ వారు ప్రత్యేకంగా రెండు పోస్టర్లను విడుదల చేశారు. దీంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు రెట్టింపు అయ్యాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: