ఇప్పుడు హీరోల సినిమాలన్ని పాన్ ఇండియన్ మూవీస్ గా తెరకెక్కుతున్నాయి.  దీంతో అన్ని భాషల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  తెలుగు హీరోలు తెలుగు భాషలో డబ్బింగ్ చెప్పుకుంటే.. ఇతర భాషల్లో వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తుంటారు.  ఇది ఎప్పటి నుంచో వస్తున్నది.  అయితే, దీనిని నాగ్ మార్చే ప్రయత్నం చేశాడు.  


నాగ్, కార్తీ  హీరోలుగా తెరకెక్కిన ఊపిరి సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరించారు.  తెలుగు, తమిళంలో నాగార్జున డబ్బింగ్ చెప్పారు.  అలా చెప్పడం వలన ప్రేక్షకులకు ఫీల్ వస్తుంది.  ఆ ఫీల్ ను ఎంజాయ్ చేస్తారు.  అయితే, తమిళ హీరో కార్తీ తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నాడు.  కార్తీని బాటలో సూర్య కూడా పయనించడం విశేషం.  గ్యాంగ్ సినిమలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు.  


ఇదిలా ఉంటె, మహేష్ బాబు స్పైడర్ తమిళ వెర్షన్ కు సొంతంగా డబ్బింగ్ చెప్పి షాక్ ఇచ్చాడు. అలాగే బాలకృష్ణ శ్రీరామా రాజ్యం తమిళ వెర్షన్ కు డబ్బింగ్ చెప్పాడు.  అటు మహానాయుడు హిందీ వెర్షన్ కు కూడా బాలయ్య సొంతంగా డబ్బింగ్ చెప్పాడట.  


ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ బాటలోనే పయనిస్తున్నాడు.  ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో సినిమా తెలుగుతో పాటు సౌత్ ఇండియన్, హిందీ భాషల్లో కూడా డబ్ చేస్తున్నారు.  అయితే, హిందీలో ప్రభాస్ డబ్బింగ్ చెప్తున్నాడని తెలుస్తోంది.  ప్రభాస్ కు హిందీ వచ్చినా అందులో సౌత్ యాస ఉంటుంది కాబట్టి యాసను మార్చుకునేందుకు ప్రభాస్ ట్యూషన్ పెట్టుకొని డబ్బింగ్ చెప్పుకున్నాడట.   


మరింత సమాచారం తెలుసుకోండి: