ఒక్క సారి మొహానికి మేకప్ వేసుకొని హీరోయిన్ అయ్యాక మీడియాలో అన్నీ రకాల కామెంట్స్ వస్తుంటాయి. వాటిలో మంచివి ఉంటాయి. చెత్త కామెంట్స్ కూడా ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనవసరం లేదు. జరిగిందొకటి రాసేదొకటి..మా జీవితాలతో సోషల్ మీడియా వాళ్ళు ఆడుకుంటున్నారని కొంతమంది హీరోయిన్సైతే తెగ గగ్గోలు పెడుతుంటారు. అయితే అలాంటి కామెంట్స్ నేనసలు కేర్ చేయనంటోంది ఇస్మార్ట్ హీరోయిన్ నిధీ అగర్వాల్. అక్కినేని హీరోలతో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ నిధీ అందం పూరీకి బాగా నచ్చడంతో ప్రస్తుతానికి ఈమే నా నిధి అనుకున్న పూరీ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.


పూరీ సినిమాలో నటిస్తున్న నిధీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కొత్త కొత్త ఫొటో షూట్స్ తో రెచ్చిపోతూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్ లో హాట్ హాట్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ 24/7 ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ ఫుల్ గా అట్రాక్ట్ చేస్తోంది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం కొన్ని చెత్త కామెంట్స్‌తో నిధిని చులకనగా మాట్లాడుతున్నారు. ఇలాంటి కామెంట్స్ ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని కొంతమంది హీరోయిన్స్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. రివర్స్ కామెంట్స్ తో కౌంటర్ ఇచ్చేస్తారు.  కానీ నిధీ మాత్రం ఇలాంటివి నాకు జూజూబీ అంటోంది. 


ఈ విషయంపై ఒక అభిమాని మిమ్మలిని కామెంట్ చేసే వాళ్ళకి గట్టిగా రిప్లై ఇవ్వచ్చు కదా అని నిధిని అడిగితే "అలాంటి వేస్ట్ జనాల మాటలను నేను అసలు పట్టించుకోను.. నేను చాలా బిజీగా ఉన్నాను. అనవసరంగా అసలు నా టైం వేస్ట్ చేసుకోను అని స్మార్ట్ గా సమాధానమిచ్చింది. కొన్నిటిని తెలుగులోకి డైరెక్ట్ గా అనువదిస్తే తెగులు తగిలిన పదాల్లాగ మారిపోతాయి కదా.  నిధి చెప్పిన దాన్ని సాఫ్ట్ గా  చెప్పుకోవాలంటే "ట్రోలర్లు ఎంగిలాకుల్లా ఎగిరెగిరి పడ్డా నాకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు" అనే ఉద్దేశం అన్నమాట. ఇక నిధి సినిమాల విషయానికి వస్తే ఇప్పటివరకూ తెలుగులో 'సవ్యసాచి'.. 'మిస్టర్..మజ్ను' సినిమాలో నటించింది.  ప్రస్తుతం పూరి జగన్నాథ్-రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్ శంకర్ లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.  'ఇస్మార్ట్ శంకర్' జులై 12 న రిలీజ్ కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: