తాప్సి.. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. తాప్సి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రోజుల్లో ముంబై, హైదరాబాద్ లో ఉండేది. ముంబైలో ఉండటం కోసం ఇల్లు కావాలి. ఇంటికోసం ముంబైని జల్లెడ వేసింది. సినిమాల్లో చేస్తున్నామని చెప్పగానే ఇల్లు అద్దెకు ఇవ్వలేదట. ముంబై ఇల్లు అద్దెకు దొరకడం చాలా కష్టమని, సొంత ఇల్లు ఉంటేనే మనుగడ ఉంటుందని చెప్పింది తాప్సి.
హైదరాబాద్ లో అలా కాదని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ లో ఇల్లు చాలా ఈజీగా దొరికిందని, చాల కన్వీనియంగ్ గా ఉన్నట్టు చెప్పుకొచ్చింది సొట్ట బుగ్గల తాప్సి. అటు ఢిల్లీ లో కూడా ఇంటి వసతి బాగుంటుందట. ప్రస్తుతం ముంబైలో తన చెల్లితో కలిసి ఉంటున్నట్టు చెప్పింది.
రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝమ్మంది నాదం సినిమాతో తాప్సి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. అనంతరం బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ కొన్ని సినిమాలు చేసే వరకు కష్టపడింది. ఇప్పుడు ఈ అమ్మడు అక్కడ టాప్ హీరోయిన్ గా మారిపోయింది.
చాలా కాలం తరువాత తెలుగులో ఆనందో బ్రహ్మ చేసింది. హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విజయంతో టాలీవుడ్ లో మరలా అవకాశాలు వస్తాయని అనుకుంది. కానీ, పెద్దగా ఆ అవకాశాలు రాకపోవడం విశేషం.