మాములుగా సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త ఒరవడి కొనసాగుతోంది. ఓ హీరోయిన్ ఏదైనా సినిమాలో నటిస్తే..అది హిట్టయితే అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. అదే ఫ్లాప్ అయినా నటన బాగుంటే మరో చిత్రంలో చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తే చాలు అగ్రహీరోలందరి చిత్రాలకు ఈమెనే హీరోయిన్గా ఎంపిక చేస్తారు.
తర్వాత వాళ్లు నటించిన రెండు మూడు సినిమాలు అపజయం పాలైతే మళ్లీ అవకాశాలు రావు. ఇప్పుడూ ఇదే ట్రెండ్ తెలుగు చిత్రసీమలో కొనసాగుతోంది. అగ్రకథానాయికలందరూ పూజా హెగ్డే, రష్మిక మండన్నానే కథానాయిుకలుగా ఎంపిక చేసుకుంటున్నారు. ఒక వేళ అవకాశం ఉంటే ఆ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర చేయాల్సి ఉంటే మాత్రం చిన్న చిత్రాల్లో చేసిన వారిని కథానాయికగా ఎంపిక చేస్తున్నారు.
రష్మిక మండన్నా తెలుగులో తన మొదటి చిత్రం 'ఛలో'తోనే మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత 'గీత గోవిందం'లో తన నటనతో మెప్పించింది. ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' సినిమా అదే హీరోతో చేస్తుంది. ప్రస్తుతం అగ్రహీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ సరసన నటిస్తుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేశ్ చిత్రంలో రష్మిక కథానాయిక. అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న మరో సినిమాలో కూడా ఈమె లీడ్ రోల్ పోషించనుంది. అంతేగాకుండా నితిన్ చిత్రం 'భీష్మ'లోనూ, కార్తిక్ హీరోగా చేసే చిత్రంలోనే ఈమె నటిస్తుంది.