రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. దీంతో రకుల్ జాతకం మారిపోయింది. ఒక్కొక్కటిగా సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చింది. డబ్బు, పేరు సంపాదించింది.
అక్కడితో ఆగకుండా ఈ అమ్మడు.. బాలీవుడ్ లోను అవకాశలు దక్కించుకుంది. అక్కడ ఓ మంచి సినిమా చేసి సూపర్బ్ అనిపించుకుంది. కోలీవుడ్ లోను అదే దూకుడును ప్రదర్శించింది. అంతా బాగుంది గాని, ఈ అమ్మడు తనలో ఉన్న మైనస్ పాయింట్ లను తానే బయటపెట్టుకుంటోంది.
నా తొలి సినిమాని చూసి అందంగా కనిపించావంటే సంతోషిస్తాను. రెండో సినిమాని చూశాక కూడా ఆ మాటొక్కటే చెప్పారంటే నేను ఏం ఏదిగినట్టు? నా పనితీరులో అంతకుమించి ఇంకేదో నచ్చాలి కదా. చేసే ప్రతి సినిమా నటిగా నన్నొక మెట్టు ఎక్కించాలని ఆశిస్తా. అందుకోసం ఎంతగా శ్రమించడానికైనా సిద్ధమే.. అంటూ సెలవిచ్చింది.
ప్రస్తుతం మన్మధుడు నాగార్జునతో మన్మధుడు 2 లో చేస్తున్నది. అంతేకాదు నితిన్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు జిమ్ వ్యాపారంలో బిజీగా మారిపోయింది. సో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోంది రకుల్.