స్టార్‌ హీరోలందరితోను సినిమాలు తీయడమే కాకుండా వారందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తాడు దిల్ రాజ్. ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది భారీ నిర్మాతలు ఉన్నా దిల్‌ రాజు చేసే సాహసాలు మరెవ్వరు చేయడానికి ప్రస్తుత పరిస్థుతులలో సాహసించలేకపోతున్నారు. మహేష్ చరణ్ అల్లు అర్జున్ జూనియర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే దిల్ రాజ్ కు ప్రభాస్ తో కూడ గతంలో మంచి సాన్నిహిత్యం ఉండేది. 

అయితే ఎదో ఒక చిన్న భేదాభిప్రాయం వల్ల దిల్ రాజ్ ప్రభాస్ కు దూరం అయ్యాడు అన్న గాసిప్పులు ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి. దీనితో దిల్ రాజ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభాస్ తో సినిమా తీయాలి అన్న కల నెరవేరడం లేదు అని అంటారు. వాస్తవానికి చాల కాలం క్రితం వీరిద్దరి కాంబినేషన్ లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ మూవీ వచ్చినా ఆతరువాత ఎదో బయటపడని గ్యాప్ వీరిద్దరి మధ్య ఉంది అని అంటారు. 

ఇలాంటి పరిస్థుతులలో దిల్ రాజ్ ప్రభాస్ కు తిరిగి సాన్నిహిత్యం పొందడానికి ఆడుతున్న 45 కోట్ల జూదం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఆగష్టులో విడుదల కాబోతున్న ‘సాహో’ మూవీ నైజాం ఉత్తరాంధ్ర హక్కులు భారీ మొత్తానికి తీసుకుని ప్రభాస్‌ దృష్టిని ఆకర్షించాడు. ఈ రెండు ఏరియాలకీ అత్యధిక అమౌంట్‌ ఆఫర్‌  చేయడమే కాకుండా ఈ రెండు ఏరియాలకీ రెండు ఒకటి నిష్పత్తిలో నలభై అయిదు కోట్లు ఆఫర్‌ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. 

దీనితో ప్రస్తుత పరిస్థితులలో ‘సాహో’ కి సంబంధించి ఇంతకుమించి కోట్‌ చేయడం మిగతా బయ్యర్ల వల్ల అయ్యేపని కాదు అని అంటున్నారు. ఒకవేళ రెండు మూడు కోట్లు ఎవరైనా ఆఫర్ ఇచ్చిన దిల్‌ రాజు మాదిరిగా ఈ రెండు ఏరియాల్లో పర్‌ఫెక్ట్‌ గా మూవీని రిలీజ్ చేసి కలక్షన్స్ రాబట్టగల సమర్ధత మరి ఏవ్యక్తికి లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ప్రభాస్ కు దగ్గర కావడానికి దిల్ రాజ్ 45 కోట్ల జూదం ఆడుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కొందరు చేస్తున్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: