దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇటీవల ఈ చిత్ర షూటింగ్ లో గాయపడ్డ హీరోలు చరణ్, ఎన్టీఆర్ లు తిరిగి కోలుకోవడంతో జక్కన్న సినిమాను ఇకపై బ్రేకులు లేకుండా చిత్రీకరించడానికి సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ మీద కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారని, వాటి తరువాత చరణ్ విదేశాల నుండి తిరిగిరాగానే వారిద్దరిపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తీయనున్నారని సమాచారం. 

అయితే ఈ సినిమాకు సంబంధించి నేడు మరొక వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాక ముందే ఈ సినిమాకు అన్ని చోట్ల నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయని, ఇకపోతే నిన్న ఒక బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆర్ఆర్ఆర్ మూవీ ఓవర్సీస్ హక్కులను రూ.70 కోట్లకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి ఇప్పటికే ఓవర్సీస్ లో అత్యథిక కలెక్షన్ రాబట్టిన చిత్రంగా అక్కడ బాహుబలి-2 సినిమా ప్రధమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాతి రాజమౌళి సినిమా కావడం, అది కూడా టాలీవుడ్ లోని ఇద్దరు బడా స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ కు ఇంత భారీ ఎత్తున బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. 

అయితే ఇప్పటికి కేవలం 25 శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భారీ సినిమాని అవకాశం ఉన్నంత త్వరగా పూర్తి చేసేపనిలో ఉన్నామని, ఆ తరువాతనే తమ చిత్ర దర్శక, నిత్మతలు బిజినెస్ మీద దృష్టి పెట్టడం జరుగుతుందని అంటోందట ఆ చిత్ర యూనిట్. అయితే ఆర్ఆర్ఆర్ భారీ స్థాయిలో రూపొందనుండడంతో ఎలాగైనా సినిమాను దక్కించుకోవాలని ఈ విధంగా బయ్యర్లు ఇప్పటినుండే పోటీ పడుతూ ఉండడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: