మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ అలియాస్ సాయి తేజ్ చిత్రలహరితో హిట్ కొట్టాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మెగా హీరో వరుస ఫ్లాపుల నుండి కాపాడింది. 6 వరుస ఫ్లాపుల తర్వాత సాయి తేజ్ కు చిత్రలహరి హిట్ కాస్త ఊరటనిచ్చింది. ఇదిలాఉంటే ప్రస్తుతం కథల విషయంలో తొందరపడకుండా జాగ్రత్తపడుతున్నాడు సాయి తేజ్.


హిట్టు కొట్టాం కదా అని విర్రవీగితే ఫ్లాపులు ఎలా పలుకరిస్తాయో బాగా అర్ధమైంది. అందుకే సైలెంట్ గా తన తర్వాత సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సాయి తేజ్, మారుతి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది.  


ఈ సినిమాకు భోగి టైటిల్ ఫిక్స్ చేశారట. 2020 సంక్రాంతి టార్గెట్ తో ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగల్లో మొదటి రోజు భోగి.. మరి సినిమా టైటిల్ కాబట్టి భోగి రోజే ఈ సినిమా ఉంటుందేమో చూడాలి. మినిమం గ్యారెంటీ సినిమాలను చేసే మారుతి సాయి తేజ్ తో చేస్తున్న భోగి ఎలా ఉంటుందో చూడాలి. 


ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక శర్మ నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఉండగా రెజినాకు ఇవ్వాలని చెబుతున్నాడట సాయి తేజ్. అయితే రెజినా ఆల్రెడీ ఫేడవుట్ అయిపోయింది. అందుకే మారుతి ఆమె ప్లేస్ లో మరో భామని పెట్టాలని చూస్తున్నాడట. మరి సాయి తేజ్, మారుతిల కాంబినేషన్ లో వస్తున్న భోగి ఎలా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: