అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో యూత్ లో సెన్సేషనల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ లాస్ట్ ఇయర్ టాక్సీవాలాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటుగా క్రాంతి మాధవ్ తో బ్రేకప్.. ఆనంద్ ఆన్నామలై డైరక్షన్ లో హీరో సినిమా చేస్తున్నాడు.


డియర్ కామ్రేడ్ రిలీజ్ కు రెడీ అవుతుండగా బ్రేకప్, హీరో సినిమాలు రిలీజ్ కు టైం పట్టేలా ఉంది. అయితే లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసాని సినిమా మొదలైంది. జీవిత రాజశేఖర్ ల చిన్న కూతురు శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే ఈ సినిమా టీజర్ రిలీజైంది.


కె.వి.ఆర్ మహేంద్ర డైరక్షన్ లో వస్తున్న దొరసాని టీజర్ ఇంప్రెస్ చేసింది. అయితే తమ్ముడి తొలి సినిమాకు విజయ్ దేవరకొండ ప్రమోట్ చేస్తాడని అనుకున్నారు కాని అందుకు విరుద్ధంగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. నిన్న రిలీజైన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ట్రైలర్ రిలీజ్ అవగా ఆ ట్రైలర్ పై విజయ్ స్పందించాడు.


స్వరూప్ డైరక్షన్ లో వస్తున్న ఈ క్రైం థ్రిల్లర్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి స్పందించిన విజయ్ తన తమ్ముడి సినిమా టీజర్ రిలీజ్ పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ విషయంపై విజయ్ యాటిట్యూడ్ మీద అతని ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ టీజర్ స్కిప్ చేసినా రిలీజ్ టైంలో ప్రమోట్ చేస్తాడేమో అని అంటున్నారు. ఆడియో ఈవ్నెట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగు ఉంటుంది కాబట్టి అప్పుడు తమ్ముడికి కావాల్సిన సపోర్ట్ విజయ్ తప్పక ఇవ్వాల్సిందే. హీరోగా అన్న క్లిక్ అయ్యాడు మరి తమ్ముడు ఏం చేస్తాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: