ఈ మద్య టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ పెరిగిపోతున్న తరుణంలో సినీ, టీవి నటులు రోడ్డు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా టివి నటులు బిగ్ బాస్ 1 ఫేమ్ జ్యోతి, గీతా సింగ్, జబర్ధస్త్ కమెడియన్ రఘు పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు. 

మదనపల్లి నుంచి తిరుపతి వెళ్తున్న మార్గ మద్యలో అకస్మాత్తుగా కారు టైరు ఊడిపోవడంతో ఒక్కసారే ప్రమాదం జరిగింది.  అదృష్టం కొద్ది వీరి కారు రోడ్డు సైడ్ ఆగిపోయింది.  ఈ సందర్భంగా నటి జ్యోతి మాట్లాడుతూ..ఉన్నట్టుండి కారు టైర్ ఊడిపోవడంతో సడెన్ గా బ్రేక్ వేశామని..అదృష్టం కొద్ది కారు రోడ్డు సైడ్ కి ఆగిపోయిందని..లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని జ్యోతి అన్నారు.

దేవుడి దయవల్ల నేను, గీతా సింగ్, రఘు బతికిపోయామని అన్నారు. అంతే కాదు ఈ ముగ్గురు కూడా ఎలాంటి గాయాలు లేకుండా బతికిపోవడం నిజంగానే అదృష్టమని అంటున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: