టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ జంట ఎవరంటే ఇప్పుడు చైతూ-సమంత అని అంటారు.  ఏం మాయ చేసావే సినిమాతో పరిచయం అయిన ఈ జంట మనం సినిమా తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లైన మూడు నెలలు హనీమూన్ ట్రిప్ వేసిన చైతూ-సమంత అక్కడ నుంచి వచ్చిన తర్వాత వరుసగా సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.  అయితే పెళ్లైన తర్వాత సమంత అదృష్టం బాగా కలిసి వచ్చినట్టుంది..ఆమె నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతూ వచ్చాయి.

ఆ మద్య చైతూ-సమంత కలిసి జంటగా నటించిన ‘మజిలీ’సినిమా నాగ చైతన్య కెరీర్ లో భారీ వసూళ్లు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.  ఈ మద్య సినిమా హీరోయిన్లు షూటింగ్ బిజీ కన్నా షాపింగ్ మాల్స్, షోరూమ్స్ ఓపెనింగ్ లో బిజీగా ఉంటున్నారు. తాజాగా సమంత అక్కినేని కొండాపూర్‌లో సందడి చేశారు. బేబీ లుక్‌లో అదుర్స్ అనిపించారు. కొండాపూర్‌లో ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన ‘ఒప్పొ’ మొబైల్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సమంత వేసుకున్న పూల డిజైన్‌తో ఉన్న పసుపు రంగు ఫ్రాక్‌లో చూస్తుంటే కుర్రాకారుకి పిచ్చెక్కి పోయేలా ఉంది. 

సమంతతో సెల్ఫీల కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడటంతో కాస్త గందరగోళం ఏర్పడింది.  స‌మంత, నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లలో నటించిన ‘ఓ బేబీ’ విడుదలకు సిద్ధమవుతోంది. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం జూలై 5న విడుదల కానున్నట్టు సమాచారం. సీనియర్ నటి ల‌క్ష్మీ, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ నిర్మిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: