పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసిన హీరో. ఎలాంటి సినిమా చేసినా అది ఒక ట్రెండ్ సెట్టర్ గా ఉండేది. పవన్ రీమేక్ చేసిన సినిమాలు చాలా తక్కువ. అలంటి సినిమాల్లో ఒకటి కాటమరాయుడు. తమిళంలో సూపర్ హిట్టైన వీరం సినిమాకు ఇది రీమేక్.
వీరం కోలీవుడ్ లో సూపర్ హిట్టైంది. కానీ, తెలుగులో మాత్రం కాటమరాయుడిగా మెప్పించలేకపోయింది. దీనికి కారణం ఏంటో తెలియదు. మంచి ఫీల్ ఉన్న సినిమా. అలానే నటనకు మంచి స్కోప్ ఉన్న సినిమా కూడా. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్.
ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. సాజిత్ నడియావాలా వీరం రైట్స్ ను తీసుకున్నాడు. మొదట ఈ సినిమాను అక్షయ్ కుమార్ తో చేయాలని అనుకున్నాడు. కానీ, అక్షయ్ చాలా బిజీగా ఉండటంతో అక్షయ్ ప్లేస్ లోకి యూరి హీరో విక్కీ కౌశల్ ను తీసుకున్నారు.
ల్యాండ్ ఆఫ్ ది లుంగీ పేరుతొ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. టైటిల్ బాగుంది. యూరి వంటి సీరియస్ సినిమా చేసిన విక్కీ, పవన్ లా మెప్పిస్తాడా.. అజిత్ లా యాక్టింగ్ చేయగలుగుతాడా... సాజిద్ మాట నిలిపుతాడా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.