తెలుగు సినీలోకంలో ప్రముఖ నటుడు గిరిబాబు. ఆయన గురించి తెలియని వారు లేరు. ఆయన అటు సినిమాలు చేస్తూ ఇటు రాజకీయాలు కూడా చేస్తూ వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు అన్న నందమూరి తారకరామారావుకు ప్రచారం చేశారు.


ఇక 2004 ఎన్నికల ముందు వైఎస్సార్ కి కూడా ప్రచారం చేశారు. 2014 ఎన్నికలకు ముందు జగన్ పార్టీ తరఫున కూడా ప్రచారం చేసిన గిరిబాబు తాజా ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయాన్ని కాక్షించారు. జగన్ గెలుస్తాడని రెండేళ్ళకు ముందే డిసైడ్ అయిపోయిందని ఈ వెటరన్ నటుడు అంటున్నారు. జగన్ పాదయాత్ర ద్వార ప్రజల కష్టాలు తెలుసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.


జగన్ దేవుడి పాలన అందిస్తారని కూడా ఆయన ధీమాగా చెప్పారు. ఇక చంద్రబాబును నమ్మి అయిదేళ్ళ క్రితం జనం అధికారం అప్పగిస్తే ఆయన దారుణంగా పాలించారని, ప్రజలను నానా ఇబ్బందులు పెట్టారని గిరిబాబు షాకింగ్ కామెంట్స్ చేస్శారు. ఇపుడు ప్రజలు అన్నీ తెలుసుకుని జగన్ నాయకత్వాన్ని కోరుకున్నారని, ఆయన మంచి పాలన అందిచడం ఖాయమని గిరిబాబు చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: