కియారా అద్వానీ.. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. బాలీవుడ్ లో ఎం ఎస్ ధోని సినిమా తో వెలుగులోకి వచ్చింది ఈ మోడల్. ఇలా సినిమాలు చేస్తూనే నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా నటించి మెప్పించింది.
ఇతెలుగులో భరత్ అనే నేను తరువాత ఈ అమ్మడు రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చేసింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. బాలీవుడ్ లో ప్రస్తుతం కబీర్ సింగ్ చేస్తున్నది. ఈ సినిమా జూన్ 21 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అయ్యింది.
ఇదిలా ఉంటె, ఈ లస్ట్ భామ ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ అనే మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోజులు ఇచ్చింది. పెళ్లి కూతురు గెటప్ లో ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలే ముట్టుకుంటే కందిపోయేటంతటి అందం. ఆ అందానికి పెళ్లి కూతురు డ్రెస్ వేస్తె ఇంకెలా ఉంటుంది చెప్పండి.
యూత్ కు ఈ కవర్ పేజీ ఫోటో విపరీతంగా నచ్చినట్టుంది. వరసగా లైక్ లు షేర్ లు చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫొటోకు లక్షల్లో లైకులు వస్తున్నాయి. వినయ విధేయ రామ తరువాత తెలుగులో ఈ అమ్మడు ఏ సినిమాకు సైన్ చేయలేదు. బహుశా బాలీవుడ్ లో బిజీగా ఉండటం వలన తెలుగును పక్కన పెట్టిందేమో.