కియారా అద్వానీ.. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.  బాలీవుడ్ లో ఎం ఎస్ ధోని సినిమా తో వెలుగులోకి వచ్చింది ఈ మోడల్.  ఇలా సినిమాలు చేస్తూనే నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా నటించి మెప్పించింది.  


ఇతెలుగులో భరత్ అనే నేను తరువాత ఈ అమ్మడు రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చేసింది.  ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.  బాలీవుడ్ లో ప్రస్తుతం కబీర్ సింగ్ చేస్తున్నది.  ఈ సినిమా జూన్ 21 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అయ్యింది.  


ఇదిలా ఉంటె, ఈ లస్ట్ భామ ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ అనే మ్యాగజైన్  కవర్ పేజీపై ఫోజులు ఇచ్చింది. పెళ్లి కూతురు గెటప్ లో ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలే ముట్టుకుంటే కందిపోయేటంతటి అందం.  ఆ అందానికి పెళ్లి కూతురు డ్రెస్ వేస్తె ఇంకెలా ఉంటుంది చెప్పండి. 


యూత్ కు ఈ కవర్ పేజీ ఫోటో విపరీతంగా నచ్చినట్టుంది.  వరసగా లైక్ లు షేర్ లు చేస్తున్నారు.  ఇంస్టాగ్రామ్ లో ఈ ఫొటోకు లక్షల్లో లైకులు వస్తున్నాయి. వినయ విధేయ రామ తరువాత తెలుగులో ఈ అమ్మడు ఏ సినిమాకు సైన్ చేయలేదు.  బహుశా బాలీవుడ్ లో బిజీగా ఉండటం వలన తెలుగును పక్కన పెట్టిందేమో.  


మరింత సమాచారం తెలుసుకోండి: