'మహర్షి' సినిమాతో సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే చాలా మందికి మతిపోతుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో  మహేష్ బాబు కి మంచి మార్కెట్ ఉంది అయినా కానీ అక్కడ పెద్దగా కలెక్షన్లు సాధించకపోయినా స్వదేశంలో మాత్రం మహర్షి సినిమా దుమ్ము దులుపుతోంది.


తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం బెంగళూరు నగరంలో మహర్షి సినిమా కి వచ్చిన కలెక్షన్ ను బట్టి మరికొద్ది సంవత్సరాల్లో మహేష్ బాబు ని టచ్ చేసే మొనగాడే లేడు అన్నట్టుగా ఆఖరికి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల కలెక్షన్లను కూడా అధిగమించేలా బెంగళూరు నగరంలో మహర్షి సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తున్నట్లు సమాచారం.


బెంగళూర్ సిటీ మీనాక్షి థియేటర్లో ఇప్పటి వరకు సూపర్ స్టార్ రజిని నటించిన “పేట” చిత్రం 35 లక్షల నెట్ గ్రాస్ వసూలు చేయగా మహర్షి మాత్రం కేవలం నాలుగు వారాల్లోనే 34 లక్షల 79 వేలు వసూలు చేసి అక్కడ పేట రికార్డును తుడిచేసే నెంబర్ 1 సౌత్ ఇండియన్ గ్రాసర్ గా నిలవనుంది అని తెలుస్తుంది.ఇదొక్కటే కాకుండా బెంగళూరు సిటీ సహా అక్కడ మొత్తం లాంగ్ రన్ లో దాదాపు 6 కోట్లు వసూలు చేయబోయే ఏకైక భారతీయ సినిమాగా మహర్షి మరో రికార్డు నమోదు చేసేందుకు అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలకి సంబంధించిన వారు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: