ఫిల్మ్ ఇండస్ట్రీలోకొచ్చాక కూడా చాలా తక్కువ మంది హీరోయిన్స్.. వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే చేస్తారు. ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఉంటారు. ఎలాంటి సినిమాలలో నటించాలో అలాంటి సినిమాలలోనే నటిస్తారు..ఆ తరహా కథలనే ఎంచుకుంటారు. డబ్బులొస్తున్నాయి కదా అని తమ ముందుకు వచ్చిన ప్రతీ సినిమాని ఒప్పుకోరు. ఇది వాళ్ళ మీద వాళ్ళకుండే నమ్మకమో లేక డబ్బు సంపాదన మీద వ్యామోహం లేకపోవడమో తెలీదు గానీ సెలెక్టెడ్ సినిమాలనే బెస్ట్ ఛాయిస్ గా చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువగా అరుదుగా ఉంటారు. ముఖ్యంగా అప్పట్లో సౌందర్య..ప్రస్తుతం నిత్యా మీనన్, సాయి పల్లవి.
గాల్లో బెలూన్లు ఎగరేసి ఎంజాయ్ చేస్తున్నారు నిత్యామీనన్. 'బ్రీత్' వెబ్ సిరీస్ సీజన్ 2 షూటింగ్ పూర్తికావడమే ఈ ఆనందానికి కారణం లేటెస్ట్ అప్డేట్. 'బ్రీత్' షూటింగ్ను సక్సస్ ఫుల్గా కంప్లీట్ చేశాం. ఒకరినొకరం బాగా మిస్ అవబోతున్నాం అని చెప్పడానికి బాధగా ఉంది. ఇప్పటివరకు యాక్టింగ్లో నా బెస్ట్ టైమ్ ఇదేనని భావిస్తున్నాను.. అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు నిత్యా. 'బ్రీత్' సెకండ్ సీజన్లో అభిషేక్ బచ్చన్ నటించారు. ఫస్ట్ సీజన్లో మాధవన్ నటించిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వెబ్సిరీస్లలో నిత్యా నటించడం ఇదే మొదటిసారి.
ఇప్పటికే కియార అద్వాని, మనీషా కోయిరాల, నేహ ధూపియా, భూమీ పడ్నేకర్ వంటి బాలీవుడ్ హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్వైపు వెళ్లిన నిత్యాకు చేతిలో సినిమాలు లేవనుకుంటే మాత్రం పొరపాటే. 'మిషన్ మంగళ్' సినిమాతో ఈ ఏడాదే బాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ బ్యూటీ సౌత్లోనూ ఫుల్ బిజీగా ఉంది. తమిళంలో సైకో, ది ఐరన్లేడీ (జయలలిత బయోపిక్) సినిమాలతో పాటు కొన్ని మలయాళ సినిమాలు చేస్తున్నారు. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్లో నటించడానికి కథలు వింటున్నారట. ఇలా సినిమాలు, డిజిటల్ సెక్టార్ని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ను భలేగా ప్లాన్ చేసుకుంటున్నారు నిత్యామీనన్ అని మిగతా హీరోయిన్స్ పొగిడేస్తున్నారట.