సూపర్ స్టార్ మహేష్ బాబు బావ జయదేవ్ గల్లా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు ఎంపిగా మరొక్కసారి ఆయన విజయం సాధించడం జరిగింది. ఇకపోతే కొద్దిరోజుల క్రితం జయదేవ్ పెద్ద కొడుకు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతూ దిల్ రాజు బ్యానర్ పై ఒక సినిమా ప్రారంభం అవడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమా ఆగిపోయినట్లు సమాచారం. 

నిజానికి ఏమి జరిగిందో తెలియదు గాని ఆ సినిమాను మాత్రం ప్రక్కన పెట్టేశారట నిర్మాతలు. ఇకపోతే ఆ సినిమా స్థానంలో అశోక్ హీరోగా ఇటీవల శమంతకమణి, దేవదాస్ సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్యను దర్శకుడిగా తీసుకుంటూ మరొక సినిమాని ప్లాన్ చేశారట నిర్మాతలు. వెరైటీ కథాంశాలతో ఆకట్టుకునే విధంగా సినిమాలు తీయడంలో పేరున్న శ్రీరామ్, ఈ సినిమాలో అశోక్ గల్లాను మంచి ఎంటర్టైనింగ్ స్టయిల్లో చూపించబోతున్నాడని అంటున్నారు. 

అయితే ఈ చిత్రానికి సంబందించిన అన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అతి త్వరలో దీని ప్రారంభానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా  రానుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్, మరియు ఇతర నటీనటులు అలానే సాంకేతిక నిపుణుల వివరాలు తదితరాలన్నీ చిత్ర ప్రారంభోత్వసం నాడే తెలియనున్నాయట. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదుగాని ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: