ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది. ఎవరో ఒకరి సెలబ్రిటీ స్టోరీ ని ఆధారం చేసుకుని వెండితెరపై చూపిస్తుంటే ప్రేక్షకులు ఆ సినిమా కి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఆటల విషయంలో ప్రముఖుల కథలను తీసుకొని చేస్తుంటే అతను సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు సినీ ప్రేక్షకులు.


ఏది ఏమైనా ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ లకు మంచి గిరాకీ ఉంది. ఇటువంటి సమయములో పరుగుల రాణి పి.టి.ఉష బయోపిక్ ని తెరకెక్కించడానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే బయోపిక్ లో మొదట్లో ప్రియాంక చోప్రాని అనుకున్నప్పటికి సినిమా సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు కత్రినా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.  


కత్రినా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించింది. తనకు కథ కరెక్ట్ గా సెట్టయితే నటించడానికి సిద్దమే అంటూ.. ఇంకా కథకు సంతకం చేయకముందే ఆ విషయంపై మాట్లాడటం సరికాదని కత్రినా సమాధానమిచ్చింది. మొత్తంమీద కత్రినాకైఫ్ స్పందన చూస్తుంటే స్టోరీ ఒక కొలిక్కి వచ్చే దాకా ఏ మాట్లాడకూడదని అనుకున్నట్టుగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: