ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి భారత్ ఆస్ట్రేలియా జట్లు తలపడే మ్యాచ్ కి మహేష్ బాబు కుటుంబంతో సహా మహర్షి సినిమా డైరెక్టర్ పైడిపల్లి వంశీ హాజరయ్యారు. ఇటీవల మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో కుటుంబంతో సహా మహేష్బాబు యూరప్ ట్రిప్ వేయడం జరిగింది.


చాలాచోట్ల ఈ పర్యటనలో కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను కూడా అలా రించడం జరిగింది. పర్యటనలో భాగంగా  జర్మనీలోని పలు ప్రాంతాలు సందర్శించిన మహేష్ కుటుంబం ఆ తరువాత ఇటలీ వెళ్ళింది. ప్రస్తుతానికి మహేష్ తన కుటుంబం తో సహా ఇండియాకు ఆస్ట్రేలియా తో జరిగే క్రికెట్ మ్యాచ్ చుడానికి ఇంగ్లాండ్ కి వెళ్ళాడు. కాగా అక్కడ దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబం కూడా మహేష్ కుటుంబంతో కలిసింది.


అయితే స్టేడియం లో వారిరువురు కలిసిన సమయంలో తీసుకున్న సెల్ఫీ ని దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పర్యటన అయిన వెంటనే మహేష్ బాబు అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమాలో నటించడం ఖాయమని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: