ప్రపంచ కప్‌లో టీమిండియా శుభారంభం చేసి కీలకమైన ఆస్ట్రేలియాతో నేడు (జూన్ 9) ఢీ కొడుతోంది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవల్ (లండన్) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు కొడుకు గౌతమ్‌తో కలిసి వెళ్లారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. 


‘మహర్షి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్‌లో ఉన్నారు. నేడు ఓవల్‌లో ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య ఆసక్తికర పోరు జరుగుతుండటంతో ఫ్యామిలీతో కలిసి మ్యాచ్‌ని చూసేందుకు వెళ్లారు మహేష్ బాబు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. మహేష్‌తో పాటు భార్య నమ్రతా శిరోద్కర్, కొడుకు గౌతమ్, కూతురు సితార, ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వెళ్లినవారిలో ఉన్నారు. 


ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం తరువాత అనీల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌కి జోడీగా రష్మికా మందనా నటిస్తోంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: