బాక్సాఫీస్ వద్ద  'మహర్షి'తో  భారీ వసూళ్లు సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు,  ప్రస్తుతం ఆ భారీ సక్సెస్ ను  ఎంజాయ్ చెయ్యటానికి   ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.  అయితే  ఈ రోజు  ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ కి  మహేశ్ కుటుంబ సమేతంగా హాజరు అయితే.. మహేశ్ కోసం మరో సెలెబ్రిటీ  దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా మ్యాచ్ ని  వీక్షించడానికి వచ్చాడు.   


వంశీ పైడిపల్లి, మహేష్ తో మరియు మహేష్  ఫ్యామిలీతో దిగిన సెల్ఫీని  తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  ఇక  ఈ ఫోటోలో మహేష్  బ్లూ కలర్ టీషర్ట్ లో గాగుల్స్ తో కూల్ గా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు.  మొత్తానికి 'మహర్షి'  బ్లాక్ బ్లస్టర్ తరువాత,  మహేశ్ - వంశీల మధ్య స్నేహం మరో స్థాయికి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇదివరకు తనకు 'పోకరి', 'ఒక్కడు' లాంటి కెరీర్ టర్నింగ్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ తో కూడా  మహేష్  ఇంత క్లోజ్ గా  మూవ్ అవ్వలేదు.  స్వతహాగా కాస్త దూరంగా ఉండే మహేష్  వంశీ విషయంలో మాత్రం చాలా సన్నిహితంగా ఉంటున్నాడు.   

ఇప్పటికే పలు వేడుకల్లో మహేశ్ 'వంశీ నాకు  సోదరుడితో సమానమని చెప్పితే.. ఇటీవలే 'అలీతో సరదగా' ప్రోగ్రాంలో పాల్గొన్న వంశీ పైడిపల్లి..   'మహేశ్ తనకు సోల్ మేట్ అని చెప్పుకొచ్చాడు. ఇక మహేశ్ ఫ్యామిలీ మొదట జర్మనీ వెళ్లి.. అక్కడ విహారం ముగించుకుని  అటు నుంచి  ఇటలీ వెళ్ళి..  ఈ రోజు  ఇంగ్లాండ్ చేరుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: