ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ సినిమాల హవా కొనసాగుతుంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత కథలతో తీస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా పరుగుల రాణి పిటి ఉష బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


ఇందులో కత్రినాకైఫ్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శకనిర్మాతకు కత్రినాతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ విషయంపై కత్రినాకైఫ్ స్పందిస్తూ.... 'నేను ప్రాజెక్ట్ కు సంతకం చేసే వరకు డ్డీని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. నేను నటించేందుకు కథ సరైనదైతే తప్పకుండా చేస్తా' అని అన్నారు.


మరోవైపు ఫరాఖాన్ తర్వాతి సినిమాలోకత్రినా నటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పై స్పందిస్తూ.... దీని గురించి దర్శకురాలు ఫరా ఖాన్‌ను అడగాలి. నిజంగా నాకు దీని అప్‌డేట్స్‌ తెలియదు అని అన్నారు. సల్మాన్, కత్రినా జంటగా నటించిన భారత్ సినిమా రంజాన్ కు వచ్చిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: