సినిమాకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. కుటుంబానికి అంతే ప్రాముఖ్యతను ఇస్తాడు మహేష్ బాబు.  సినిమా పూర్తికాగానే తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తుంటాడు.  అక్కడి నుంచి తిరిగి వచ్చాక కొన్ని రోజులు రిలాక్స్ అయ్యి తిరిగి సినిమాలు చేయడం మహేష్ కు అలవాటు.  


మహర్షి సూపర్ హిట్ తరువాత ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళ్లారు.  సమ్మర్ వెకేషన్ కావడంతో కొన్ని రోజులు వివిధ దేశాల్లో పర్యటించి.. లండన్ వెళ్లారు.  ఈరోజు జరుగుతున్న ఇండియా.. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ ను చూసేందుకు మహేష్ ఫ్యామిలీ అక్కడికి చేరుకుంది.  


మహేష్ ఫ్యామిలీతో పాటు దర్శకుడు వంశి పైడిపల్లి కుటుంబం కూడా ఇంగ్లాండ్ వెళ్ళింది.  అక్కడ మహేష్ ఫ్యామిలీ తో కలిసి మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  అయితే, మహేష్ బాబు అక్కడ ఎన్నిరోజులు ఉంటారు అనే దానిపై క్లారిటీ రావాలి.  


ఈరోజు జరిగే మ్యాచ్ లో ఇండియా విజయం సాధిస్తే.. సెమిస్ కు వెళ్లేందుకు అవకాశం వస్తుంది. సో, ఇండియా సెమిస్ కు వెళ్తుంది కాబట్టి ఆ మ్యాచ్ లు అయ్యే వరకు అక్కడే ఉంటారని సమాచారం.  ఇండియా ఫైనల్స్ కు వెళ్తే... దగ్గరుండి కప్పు కొట్టించి వస్తారేమో. 


మరింత సమాచారం తెలుసుకోండి: