కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చేసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అటు బాలీవుడ్ లో ఎంఎస్ ధోని సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. లస్ట్ స్టోరీస్ తో క్రేజ్ ను పోయిందిన ఈ భామ.. బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమా చేసింది.
ఇందులో కొన్ని సీన్స్ ఉన్నాయి. అవేమంటే.. హీరోతో ముద్దులు. తెలుగులో ఈ ముద్దు సీన్స్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ, బాలీవుడ్ లో ఈ సీన్స్ విషయంలో హద్దులు ఉండవు. లిప్ టు లిప్ కిస్ లు ఒకింత ఎక్కువే అని చెప్పాలి.
హద్దులు ఉండవు కాబట్టి ఎంతైనా చెయ్యొచ్చు. ఎంతవరకైనా ముద్దు సీన్స్ ను వాడుకోవచ్చు. కబీర్ సింగ్ లో కియారా అద్వానీతో ముద్దు సీన్స్ ఉన్నాయి. ఈ ముద్దు సీన్స్ లో కియారా అద్భుతంగా చేసింది. చేయడమే కాదు.. జీవించింది కూడా.
ఇక ఇదిలా ఉంటె, కియారా అద్వానీ ఈ సీన్స్ లో ఎలాంటి బెరుకు లేకుండా నటించి మెప్పించింది. మెప్పించడమే కాదు.. ఆ సీన్స్ లో నటించే సమయంలో తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని.. అది కేవలం నటనే అని తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదని అన్నది కియారా.