ప్రభాస్ సాహో భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చాలా జాగ్రత్తగా సినిమాను ప్లాన్ చేశారు. హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేశారు. ఆగస్టు 15 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.
సంబంధించిన టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై అందరికి ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తిని మరింత పెంచుతూ.. సినిమా రిలీజ్ డేట్ ను రేపు అనౌన్స్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటె, జూన్ మూడో వారంలో ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ను షురూ చేస్తున్నారు ప్రభాస్.
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దుబాయ్ లో ఎక్కువ భాగం చిత్రీకరించారు. శ్రద్దా కపూర్ హీరోయిన్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. జూన్ మూడో వారం నుండి ప్రభాస్ డబ్బింగ్ చెప్పనున్నాడు. ఇక సాహో సబ్జక్ట్ కి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఏక కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పైగా హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.