అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా సరిలేరు నీకెవ్వరూ సినిమా తెరకెక్కబోతున్నది.  ఈ సినిమా కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ ను అనిల్ ఇప్పటికే రెడీ చేశారు.  రష్మిక  మందన్న హీరోయిన్.  విజయశాంతి కీలక పాత్ర చేస్తోంది.  జూన్ ఎండింగ్ నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతున్నది.  


ఇదిలా ఉంటె, ఈ సినిమా గురించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  ఇది  ఎంటర్టైనర్ మూవీ.  అందులో సందేహం లేదు.  పక్కా ఎంటర్టైనర్ కావడంతో మస్త్ కామెడి ఉంటుంది.  సరే దీనిని పక్కన పెడతాం.  ఇందులో ఓ లాంగ్ ఎపిసోడ్ ఉన్నటు తెలుస్తోంది.  అది ట్రైన్ ఎపిసోడ్.  


ఈ ఎపిసోడ్ లో మహేష్ తో పాటు కీలక కమెడియన్స్ అందరు పాల్గొంటారట.  దీనికోసం ఎక్కువ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది.  ట్రైన్ లో కాకుండా ట్రైన్ సెట్ వేసి షూట్ చేయబోతున్నారు.  టైమింగ్ కామెడీ బాగుంటుందని సమాచారం.  


వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ కామెడీ ఎలాగైతే అద్భుతంగా వచ్చిందో అదే విధమైన కామెడీ కోసం అనిల్ ట్రై చేస్తున్నాడు.  ఈ కామెడీ తప్పకుండా పేలుతుందని.. ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుందని అంటున్నారు.  మరి చూద్దాం ఏమౌతుందో.  



మరింత సమాచారం తెలుసుకోండి: