మహెష్ 25 వ సినిమా మహర్షి సామజిక అంశంతో కూడిన కథతో తెరకెక్కింది.  రైతు సమస్యలు ప్రధానంగా తీసుకోవడంతో సినిమా హిట్టైంది.  ఈ సినిమా కలెక్షన్లు భారీగా వసూలు అవుతూనే ఉన్నాయి.  25 వ సినిమా పూర్తైన వెంటనే మహేష్ తన 26 వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. సినిమా ప్రారంభం కావడం అన్ని జరిగిపోయాయి.  
ఇప్పుడు మహేష్ బాబు పూర్తి స్థాయి ఎంట్రటైనేర్ సినిమా చేయాలనీ సంకల్పించుకున్నాడు.  దానికి తగ్గట్టుగానే కథను ఎంపిక చేసుకున్నాడు.  పక్కా కామెడీ అంటూనే ఇందులో కూడా కొంత వరకు సోషల్ మెసేజ్ ను యాడ్ చేసినట్టు సమాచారం.  
మహేష్ కు కామెడీ యాంగిల్ సెట్ కాదని కొందరి అభిప్రాయం.  కామెడీ చేస్తాడేమోగాని వెంకటేష్ లా మెప్పించలేదని.. అందుకే మహేష్ సీరియస్ సినిమాలు చేస్తుంటాడని అంటారు.  కానీ, త్రివిక్రమ్ ఖలేజా సినిమాలో మహేష్ లోని కామెడీ యాంగిల్ ను బయటకు తీశాడు.  
సినిమా బాగున్నా ఎందుకు ఆడలేదు.  మహేష్ తో కామెడీ సినిమా చేస్తే వర్కౌట్ కాదని ఆ సినిమా చెప్పింది.  మరి ఇప్పుడు అనిల్ రావిపూడి అదే యాంగిల్ లో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.  మరి ఈ సినిమా వర్కౌట్ అవుతుందా..కాదా .. ఒకవేళ ఇది వర్కౌట్ అయ్యింది అంటే... మహేష్ దశ తిరిగినట్టే ..


మరింత సమాచారం తెలుసుకోండి: