టాలీవుడ్ లో ఈ మద్య మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా హీరోలు వస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన మెగా హీరోలకు వారి మద్య కాంపిటీషన్ అన్న సందర్భాలు ఎప్పుడూ రాలేదు.  పిల్లా నువ్వ లేని జీవితం సినిమాతో హీరోగా పరిచయం అయిన సాయి ధరమమ్ తేజ్ వరుసగా విజయాలు అందుకున్నా..తర్వాత ఆరు సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా మిగిలాయి.  ఈ మద్య రిలీజ్ అయిన ‘చిత్రలహరి’ పరవాలేదు అనిపించుకుంది.  అయితే ఇప్పుడు సాయి తేజ్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తుంది. 

తాజాగా కామెడీ దర్శకులు మారుతి తో ఓ సినిమాలో కమిట్ అయ్యారు సాయి తేజ్.  అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ ని తీసుకోవాలని డైరెక్టర్ ప్రపోజల్ పెడితే దానికి సాయి తేజ్ నో చెప్పాడట. అయితే మెహ్రీన్ కి సాయి తేజ్ కి ఉన్న సమస్య ఏంటనేది మాత్రం తెలియడం లేదు. గతంలో 'జవాన్' సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

ఇక మెహ్రీన్ మాత్రం వరుస విజయాలు అందుకుంటూ వస్తుంది..ఇటీవల ఎఫ్ 2 సినిమాలో మెహ్రీన్ అందరినీ కడుపుబ్బా నవ్వించింది.  సాయి తేజ్ తో పోలిస్తే మెహ్రీన్ హిట్ ట్రాక్ లో ఉంది. అలాంటిది ఆమెని మాత్రం హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు సాయి తేజ్. దాంతో మారుతి యంగ్ బ్యూటీ రుక్సార్ ని రంగంలోకి దింపారు. ఈమె 'కృష్ణార్జున యుద్ధం', 'ఏబిసిడి' వంటి మూవీల్లో నటించింది. అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఏడెనిమిది కోట్లలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: