దిల్ రాజు యంగ్ హీరోగాని స్టార్ హీరోతో గాని ఒక సినిమా స్టార్ట్ చేశాడంటే ఆ సినిమా ఖచ్చితంగా థియోటర్ లో బొమ్మ పడాల్సిందే. అంత పక్కాగా కొబ్బరికాయ కొట్టే దగ్గర్నుండి గుమ్మడికాయ కొట్టే వరకు దిల్ రాజు ప్రీ ప్లాండ్ గా ఉంటాడు. అలాంటిది ఒక ఎం.పి.కొడుకుని లాంచ్ చేయబోయి సైలెంట్‌గా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడంటే విషయమేంటో అర్థం చేసుకోవచ్చు. భలే మంచి రోజు ఓ డిఫరెంట్ సినిమా. అయితే నిర్మాతలకు సో సోగా లాభాలు వచ్చాయి. శమంతకమణి ఓ ఫ్లాపు సినిమా. దీంతో నిర్మాతలకు బాగానే నష్టాలొచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నం చేయబోతున్నారు ఆ సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.


సరైన లాంచింగ్ కోసం చూస్తున్న ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ ప్రాజెక్టుకు శ్రీరామ్ ఆదిత్య సారథ్యం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గల్లా అశోక్ లాంచింగ్ కోసం నిర్మాత దిల్ రాజు ట్రయ్ చేసారు. కృష్ణారెడ్డి డైరక్షన్ లో సినిమా స్టార్ట్ చేసి, అశోక్ ఫెర్ ఫార్మెన్స్ చూసి, సైలెంట్ గా ప్రాజెక్టు ఆపేసారు. ఆ ప్రాజెక్టును రాజ్ తరుణ్ కు షిప్ట్ చేసేసారు. ఆ సినిమానే ఇద్దరి లోకం ఒకటే అని సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు.


దాంతో ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్యతో ఈ ప్రాజెక్టు సెట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ అప్డేట్. కానీ ఈసారి నిర్మాత ఎవరో తెలీదు. కాని ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ బ్యానర్ ను ఉపయోగించుకొని అశోక్ ను లాంచ్ చేయబోతున్నారని మాత్రం ఫిల్మ్ నగర్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఎంత ఎం.పి. కొడుకైనా స్టఫ్ లేకపోతే ఎవరు ఏంచేయలేరు మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: